చెన్నై, జనవరి 12 : సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు ఈ రోజు అదనంగా సెలవు ప్రకటించగా స్వస్థలాలకు వెళ్లే వారితో ప్రధానబస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. మరోపక్క వేతన సవరణ డిమాండ్ తో ఎనిమిది రోజుల నుంచి చేస్తున్న సమ్మెను ఆర్టీసీ కార్మికులు తాత్కాలికంగా నిర్మూలించడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల ఇబ్బందులు పడకోడదనే ఉద్ధేశంతో సమ్మెను విరమించినట్లు తెలిపిన ఉద్యోగులు ఇవాళ విధులకు హాజరుకావడంతో రాజధాని చెన్నై సహా అన్ని ప్రాంతాల్లో బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. పండుగకు ఊర్లకు వెళ్లే వారితో తమిళనాడులోని ప్రధాన బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పండుగ వేళ సమ్మె నిర్వహించిన కార్మికులకు కృతజ్ఞతలు చెప్పిన ప్రయాణికులు సకాలంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అభివర్ణిస్తున్నారు.