హైదరాబాద్, జనవరి 12 : టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రమణను అరెస్టుచేశారు. అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంతేకాకుండా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.