నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ...

SMTV Desk 2018-01-12 11:44:20  CM Chandrababu met with Prime Minister Modi today

అమరావతి, జనవరి 12 : పోలవరం రాజధాని నిర్మాణాలకు నిధులు సహా విభజన హామీలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఏపీలో శాసనసభ నియోజక వర్గాల సంఖ్య 175 నుంచి 225కి పెంచడం సహా, విభజన హామీలన్నీ త్వరితగతిన అమలు చేయాలనిప్రధాని మోదీకి విన్నవించనున్నారు. నేడు ఉదయం జరిగే ఈ భేటీ కోసం నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశం అనంతరం, ఆయన నేరుగా పూణే వెళ్లనున్నారు. కేంద్ర విద్యుత్ జల పరిశోధన కేంద్రం రూపొందించిన పోలవరం ప్రాజెక్టు త్రీడీ నమునాను ఆయన పరిశీలించనున్నారు. ఇక్కడికి ఏపీ జలనవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్ రావు తదితరులు పూణే పర్యటనలో సీఎంతో కలిసి పాల్గొంటారు.