న్యూఢిల్లీ, జనవర్ 10: టీమిండియా క్రికెట్ జట్టు రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనను వెలువరించింది. పర్యటనలో భాగంగా జులై 27, 29 తేదీల్లో డబ్లిన్ వేదికగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది. భారత్ చివరిసారి 2007లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్ జట్టుతో వన్డే ఆడింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాత 2009 టి20 ప్రపంచకప్ సందర్భంగా నాటింగ్హామ్లో ఇరు జట్లు పోటీ పడ్డాయి.