విజయవాడ, జనవరి 11 : ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గెజిటెడ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. జిల్లాకు గెజిటెడ్ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్లో జరిగే గెజిటెడ్ అధికారుల సంఘం మహా సభలకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. వీఆర్ఏల సంఘం ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ప్రస్తుతం 6 వేలుగా ఉన్న జీతాన్ని 10,500కు పెంచాలని ఆయనను విన్నవించారు.