హైదరాబాద్, జనవరి 10 : హైదరాబాద్ కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ముగిసింది. జలసౌదిలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ 60 టీఎంసీలు, తెలంగాణ 50 టీఎంసీలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వినియోగించుకున్న నీటితో పాటు భవిష్యత్ వినియోగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. అందుబాటులో ఉన్న 139 టీఎంసీల నీటిని వచ్చే ఆగస్టు నెల వరకు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని బోర్డు మంగళవారం ఇరు రాష్ట్రాలకు సూచించింది.