స్కూల్ కి వెళ్ళమంటే విద్యార్థిని ఆత్మహత్య..

SMTV Desk 2018-01-10 15:53:14  suicide, warangal crime, khanaapuram.

వరంగల్, జనవరి 10 : స్కూల్ కు వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఖానాపురం మండలం రామలీల తండాకు చెందిన బోడ జవహర్ లాల్, సునీత దంపతుల కూతురు బోడ సుజాత (14)బుధరావుపేట ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా సుజాత పాఠశాలకు వెళ్ళడం లేదని గ్రహించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో ఆమె తెల్లవారు ఎదావిధిగా పాఠశాలకు వెళ్ళి వచ్చింది. సాయంత్రం స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడిన సుజాత తల్లిదండ్రులు.. గ్రామమంతా వెతికారు. ఈ నేపథ్యంలో ఆ ఊరి బావిలో చూడగా సుజాత మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్న౦టాయి.