ఈ నెల 11న ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటన...

SMTV Desk 2018-01-10 14:19:04  ap cm chandrababu naidu, dharmavaram tour anantapuram dist

అనంతపురం, జనవరి 10 : ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాలను ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ(సూరి) ఇతర అధికారులు నేడు పరిశీలించారు. బుక్కపట్నం చెరువులో నిర్వహించే జలపూజకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ తదితరులు పాల్గొననున్నారు. కాగా, సీఎం చంద్రబాబు జిల్లాకు విచ్చేయనుండటంతో ఇప్పటికే టీడీపీ పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతించేందుకు సిద్దమావుతున్నారు.