పీబీఎల్‌ పోరు.. హైదరాబాద్ లో షూరూ..

SMTV Desk 2018-01-10 10:47:36  PBL, HYDERABAD, GACCHI BOWLI STADIUM, HOST, SEMI FINALS, FINALS,

హైదరాబాద్, జనవరి 10 : బ్యాడ్మింటన్ అభిమానులను ఎంత గానో అలరిస్తున్న ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) చివరి పోరాటాలకు హైదరాబాద్ వేదిక కానుంది. లీగ్‌ దశలో ఆఖరి రెండు మ్యాచ్‌లతో పాటు, రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌ లు, జనవరి 14న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. బుధవారం దిల్లీ డాషర్స్‌తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌, గురువారం హైదరాబాద్‌ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్‌ పోటీ పడనున్నాయి. ప్రస్తుతం అన్ని మ్యాచ్‌లు ఆడిన అహ్మదాబాద్‌ 17 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉండడంతో సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. తర్వాత వరుసుగా బెంగళూరు 15 పాయింట్లతో, హైదరాబాద్‌ 14 పాయింట్లతో ద్వితీయ , తృతీయ స్థానాల్లో నిలిచాయి. కాగా నిన్న చెన్నై లో జరిగిన మ్యాచ్ లో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ 5-0తో ముంబై రాకెట్స్‌ పై ఘన విజయం సాధించింది.