ఢిల్లీ పర్యటనలో గవర్నర్ నరసింహన్

SMTV Desk 2018-01-09 15:00:22  Telugu state governor Narasimhan delhi tour meeting BJP, Congress

హైదరాబాద్, జనవరి 9 : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమైన అనంతరం, ఆయన మీడియాతో మాట్లడుతూ...పలు అంశాల గురించి అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే, దేశ ప్రధాని నరేంద్ర మోదీతో, మర్యాద పూర్వకంగా భేటీ కానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, తన పని తీరుపై ఏపీ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాలపై గవర్నర్ నరసింహన్ స్పందించారు. ఒకే కుటుంబంలోని పెద్దలు, పిల్లలకు మధ్య వివాదాలు, మనస్తాపాలు ఉంటాయని అన్నారు. ఇదొక కుటుంబ వ్యవహారం లాంటిదని, దాని గురించి బయట మాట్లాడవద్దని ఆయన వెల్లడించారు.