కోల్కతా, జనవరి 9 : అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా.. కీలక నిర్ణయం తీసుకుంది. వంటేతర బొగ్గు ధరలను పెంచాలని నిర్ణయించుకుంది. దీనికి బోర్డు సైతం ఆమోదం తెలిపినట్లు సంస్థ ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీత భత్యాలు, పన్నులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని సంస్థ వెల్లడించింది. ఈ పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అయితే సగటు ధరపై 10శాతం పెంచినట్లు కోల్ ఇండియా వర్గాల సమాచారం. కోల్ ఇండియా అన్ని అనుబంధ సంస్థలకూ ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది.