ఏలూరు, జనవరి 8 : ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పోలవరాన్ని అడ్డుకోవాలని శత విధాలా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పాపాలు పోవాలని ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. తాళ్లపూడి మండలంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. స్వచ్ఛ భారత్ ఎన్ఆర్ఐ స్టాల్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఇచ్చి శ్రీశైలం నుంచి రాయలసీమకు సాగునీరు అందించామన్నారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు పంపిణీ చేశారు.