సినారె అస్థికల నిమజ్జనం

SMTV Desk 2017-06-20 16:59:31  

ఇటిక్యాల, జూన్ 20 : ప్రముఖ రచయిత, కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి అస్థికలను సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని బీచ్ పల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఆ రోజు నిర్వహించే కర్మకాండలో భాగంగా శాస్రోక్తంగా అభిషేకం నిర్వహించిన కుటుంబ సభ్యులు సినారె మనమడు చైతన్యరెడ్డితో కృష్ణానదిలో నిమజ్జనం చేయించారు. అతని వెంట నారాయణరెడ్డి పెద్ద అల్లుడు భాస్కర్ రెడ్డి, రెండో కూతురు యమున, ఆమె భర్త సురేందర్ రెడ్డి ఉన్నారు.