కరాచీ, జనవరి 7 : అగ్రరాజ్యం నిరాకరించినప్పటికీ.. అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు కొనసాగుతాయని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహ్మినా జన్జ్వా పేర్కొన్నారు. ఇటీవల అమెరికా.. పాక్ కు రక్షణ, భద్రత బలగాల విషయంలో వ్యతిరేక సంకేతాలు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరాచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్ (ఐబీఏ)లో పాల్గొన్న ఆమె.. అమెరికాను శక్తిమంతమైన దేశంగానే కాకుండా, పొరుగు దేశంగా భావిస్తున్నామని, అమెరికాతో స్నేహపూర్వకంగా మెలగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆ దేశంతో ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాలు సానుకూలంగానే జరిగాయన్నారు. కాగా జనవరి 1వ తేదీన అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై గల కారణాలను పాకిస్తాన్ విశ్లేషించే ప్రయత్నంలో ఉందన్నారు.