విజయవాడ, జనవరి 7 : విజయవాడ కనకదుర్గ ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా జరిగిన పూజ వ్యవహారంలో దేవాలయ ఈవో సూర్యకుమారి పైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు దేవాదాయశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో సంప్రదాయానికి విరుద్ధంగా పూజలు జరిపినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు పడింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గగుడి ప్రస్తుత ఇన్ఛార్జి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధకు ఈ బాధ్యతలను అప్పగించారు.