సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-01-07 15:25:07  ap cm chandrababu naidu, Siddhapuram stamping scheme opened cm, karnul dist

కర్నూలు, జనవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన జన్మభూమి-నా ఊరు కార్యక్రమన్ని ప్రజల సమస్యలు పరిష్కరించడానికే తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...రూ. 119 కోట్ల వ్యయంతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, ఈ పథకం ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు తాగునీరు అందుతుందని అన్నారు.నీళ్లు, అడవులు, ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు.