రాజమండ్రి, జనవరి 7 : "పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ మానస పుత్రిక" పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పోలవరం కాంగ్రెస్ మానస పుత్రిక అన్నారు. అలాగే టీడీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు అడిగితేనే ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మోదీతో భేటీ కానున్న నేపథ్యంలో ఆ చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం అని, అధిష్టానమే నన్ను వెలివేసిందన్నారు. పోలవరం కోసం ఎవరు పిలిచినా వెళ్తానన్నారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీతోనే పరిపాలన చేస్తుందని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు.