హైదరాబాద్, జనవరి 7 : మహిళల సాధికారతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ రన్ ఫర్ గర్ల్ ఛైల్డ్ 5కె, 10కె, 21కె పరుగును నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో కిషోర్ వికాస్ - బాలికా సాధికారతపై నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. "బేటి బచావ్ - బేటి పడావ్ నినాదంతో మహిళల సాధికారత కోసం ఏ ప్రభుత్వం చేయలేని విధంగా కేంద్రం కృషి చేస్తుంది" అని మంత్రి మహేష్ శర్మ పేర్కొన్నారు.