బెంగుళూరు బ్లాస్టర్స్ జోరుకు బ్రేక్...

SMTV Desk 2018-01-06 13:25:26  pbl, north eastern warriors won, ajay jayaram, benguluru blasters, chennai

చెన్నై, జనవరి 5 : పీబీఎల్ (ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌) లో ఆడిన రెండు మ్యాచ్ లో విజయాలు సాధించిన బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టు జోరుకు నార్త్‌ ఈస్టర్న్‌ జట్టు బ్రేక్ వేసింది. శుక్రవారం జరిగిన పోరులో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ జట్టు 3-2 ఆధిక్యంతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొదట పురుషుల డబుల్స్ లో బెంగుళూరు విజయం దక్కించుకొంది. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్‌ను ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ (వారియర్స్‌) , చోంగ్‌ వీ ఫెంగ్‌ (బ్లాస్టర్స్‌)ను ఓడించాడు. దీంతో 1–0తో ఉన్న బెంగళూరు 0–1 స్కోరుతో వెనుకబడింది. తర్వాత మహిళల సింగిల్స్‌ (వారియర్స్‌ ట్రంప్‌ మ్యా చ్‌)లో మిచెల్లీ నెగ్గి వారియర్స్‌ ఆధిక్యాన్ని 3-0కు పెంచింది. తర్వాత పురుషుల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ బెంగళూరు గెలిచినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే పోరులో చెన్నై స్మాషర్స్‌తో అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌ తలపడనుంది.