వరంగల్, జనవరి 6 : రూ. 10నాణేలు చెల్లవని వస్తున్న ఆరోపణలను పట్టించుకోకూడదని రిజర్వు బ్యాంక్ జనరల్ మేనేజర్ మేఘనాథ్ జోగి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చిల్లర వర్తకులు, ఆటోడ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండలో ఆంధ్రాబ్యాంక్ ఏర్పాటు చేసిన కాయిన్మేళాను ప్రారంభించిన ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నాణాలను రిజర్వు బ్యాంక్ తప్ప ఇతరులెవరూ ముద్రించే అవకాశ౦ లేదు కాబట్టి అవి చెల్లవనే అపోహ సరికాదన్నారు. కాగితం నోట్లు చిరిగిపోవచ్చు కాని నాణాలు దీర్ఘకాలం ఉంటాయని సూచించారు. ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలంతా పది నాణాలను వాడుకోవచ్చని తెలిపారు.