అమరావతి, జనవరి 6: "పరిపాలనలో తప్పులు చేసేది ప్రభుత్వం అయితే ఆరోపణలు మాత్రం కేంద్రంపైన చేస్తారు" అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అమలవుతున్న అన్నీ పథకాలకు కేంద్ర౦ నుంచి 80 శాతం నిధులు వస్తున్నాయని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను పథకాలకు సక్రమంగా అందించకుండా చేస్తోందని విమర్శించారు. మిత్రపక్షమైన టీడీపీ ఈ విధంగా వ్యవహరిస్తే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని వ్యాఖ్యానించారు.