న్యూఢిల్లీ, జనవరి 5 : కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభ౦ కానున్నాయి. తొలి విడత సమావేశాలను ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 9 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 5 వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఫిబ్రవరి 1 వ తేదీన ప్రవేశపెట్టనున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్ వెల్లడించారు.