అనారోగ్యంతో ఉన్న తల్లినే హతమార్చిన కొడుకు

SMTV Desk 2018-01-05 17:28:07  The son killed mother, rajkort

రాజ్‌కోట్‌, జనవరి 5 :తల్లి కొడుకుల బంధానికి మాయని మచ్చను మిగులుస్తూ గుజరాత్ లో ఓ కన్నా కొడుకే దారుణానికి వడిగాట్టాడు. అనారోగ్యంతో తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్న, కన్నా తల్లి అలనా, పాలనా ఇష్టం లేకపోవడం సహా ఆమెతో విభేదాల కారణంగా తల్లిని భవనం పై నుంచి తోసివేసి హత్య చేశాడు. సెప్టెంబర్ 26న జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణ అనంతరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని రాజ్‌కోట్ కు చెందిన సందీప్ మేద్వాని నడవలేని స్థితిలో ఉన్న కన్న తల్లిని భవనం పైకి నడిపించుకుంటూ స్వయంగా ఆయనే తీసుకు వెళ్లి, 4వ అంతస్తు నుంచి తోసివేశాడు. మళ్లీ ఇంట్లోకి తిరిగి వచ్చిన ఆయనకు కాపాలదారు తల్లి పడిపోయిన విషయం తెలుపగా, ఏమి ఎరుగనట్టు కిందకు వచ్చి, తల్లి భవనం పై నుంచి పడిపైనట్లు అందరినీ నమ్మించాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను విశ్లేషించి, కొడుకే ఈ అమానుషానికి పాల్పడినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లిని హత్య చేసిన సందీప్ ఓ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.