‘గబ్బర్’ ఆగయా...

SMTV Desk 2018-01-03 18:23:06  SHIKHAR DHAWAN, SOUTH AFRICA, INDIA, BCCI, TWEEET

కేప్ టౌన్, జనవరి 3 : భారత్ క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త.. గాయంతో భాదపడుతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సఫారీలతో తొలి టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా కు చేరుకున్న భారత్ జట్టు సాధన మొదలు పెట్టింది. మరో వైపు టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా తొలి మ్యాచ్ కు బరిలోకి దిగడం అనుమానమే అని అధికారులు వెల్లడించారు. కాగా భారత్- సౌతాఫ్రికాల మధ్య మొదటి టెస్ట్ ఈ నెల 5న కేప్ టౌన్ వేదికగా జరగనుంది.