రసాభాసగా పులివెందుల జన్మభూమి వేదిక...

SMTV Desk 2018-01-03 17:30:07  CHANDRABABU NAIDU, JANMABHOOMI-MAA URU, AVINASH REDDY,

కడప, జనవరి 3: కడప జిల్లా పులివెందులలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి అవినాష్ రెడ్డి నిలబడి దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డిని పొగిడారు. దాంతో చంద్రబాబు మాట్లాడుతూ.. వేదికపై గౌరవంగా నడుచుకోవాలని, అలాగే ఎటువంటి రాజకీయాలు చేయకూడదని అన్నారు. లిఖిత పూర్వకంగా సమస్యలను రాసిస్తే ఖచ్చితంగా పరిష్కారం చూస్తానని తెలిపారు. మంచి పని కోసం పులివెందులకు వచ్చానని, ఇలాంటి సమయంలో రాజకీయ విషయాలను మాట్లాడకూడదని హెచ్చరించారు. ఈ ఘటనతో వేదికపై కాసేపు గందరగోళం నెలకొంది.