మేడారం జాతరకు ఉపరాష్ట్రపతికి అందిన ఆహ్వానం

SMTV Desk 2018-01-03 16:33:59   Vice-President venkaiahnaidu invitation medaram jathara, Minister of State Eve Minister allola indrakaranreddy

హైదరాబాద్, జనవరి 03 : మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్శంగా ఢిల్లీకి వెళ్లిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి జాతరకు ఆహ్వానించామన్నారు. అలాగే, శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ఆయన కోరారు. కాగా, ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న ఈ జాతరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి రూ. 80 కోట్లను ఈ జాతరకు కేటాయించామన్నారు.