ఫోన్ లో ఇద్దరు సీఎంల సంప్రదింపులు

SMTV Desk 2017-06-19 18:51:15  India PM Narendramodi,AP CM Chandrababu,West Bengal CM Mamata Benarji

అమరావతి, జూన్ 19 : భారతీయ జనతా పార్టీ , రాష్ట్రప‌తి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ నేప‌థ్యంలో రామ్‌నాథ్ కోవిద్‌కు మ‌ద్దతిస్తాన‌ని చంద్రబాబు చెప్పారు. మోదీ సూచ‌న మేర‌కు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి చంద్రబాబు ఫోన్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్యర్థి కోవిద్‌కు మ‌ద్దతు తెల‌పాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీని ఆయన కోరారు. దీనికి సమాధానంగా, తాను నెదర్లాండ్స్ ట్రిప్ లో ఉన్నానని.. వచ్చిన వెంటనే ఈ విషయంపై మాట్లాడతానని చంద్రబాబుతో మమత అన్నారు.