హైదరాబాద్, జనవరి 1 : విదేశాల నుండి నగరాలకు వచ్చి ఇళ్లలో అద్దెకు౦డే వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సూచించారు. విదేశీయులు కొందరు నగరంలోకి వచ్చి చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యతిరేక పనులు చేస్తున్నారని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. వారికి ఇల్లు అద్దెకు ఇచ్చిన వారు కూడా చట్టం దృష్టిలో దోషులుగా మారుతున్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు. అద్దెకు దిగిన విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఎఫ్ఆర్ఆర్వో(ఫారెన్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం)లో తెలియజేయాలన్నారు.