గుంటూరు, డిసెంబర్ 31 : భారత ఆర్ధిక సంఘం నూతన చైర్మన్ గా సూర్యదేవర మహేంద్ర దేవ్ ఎంపికయ్యారు. ఈ మేరకు నాగార్జున వర్సిటీలో ఐఈఏ శతవార్షికోత్సం సందర్భంగా పాలకవర్గాన్ని ప్రకటించారు. ఈ సంఘంలో ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన సూర్యదేవర మహేంద్ర దేవ్ ఎంపిక కాగా, అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా అనిల్కుమార్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ వర్సీటీ ఆడిటోరియం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా మహేంద్రదేవ్ మాట్లాడుతూ.. నేను చదువుకున్న నాగార్జున వర్సిటీలోనే ఉన్నత విద్య చదువుకున్నానని, అలాంటి వందేళ్ళ చరిత్ర కలిగిన సంఘానికి ఇలా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు.