న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : ప్రస్తుత బ్యాడ్మింటన్ రంగంలో భారత్ తరపున మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఒకరిని మించి మరొకరు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇద్దరూ సమవుజ్జీలుగా రాణిస్తున్నారు. ఒకరు రియో ఒలింపిక్స్ విజేత, మరొకరు బ్యాడ్మింటన్ ఛాంపియన్. వీరిద్దరూ పుల్లెల గోపిచంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. కాగా సైనాకు, సింధుకు మధ్య ఉన్న స్నేహం గురించి సింధును ప్రశ్నించగా.. “కోర్టులో ఉన్నప్పుడు ఎంతటి స్నేహితులమైనా ప్రత్యర్థులే అవుతారు. మా మధ్య హాయ్, బై వంటి విషయాలు తప్ప మరేమి ఉండవు. శిక్షణలో ఉండటం వల్ల అసలు మాట్లాడుకోవడానికి సమయం ఉండడం లేదని” వెల్లడించారు. ప్రస్తుత బ్మాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్యూఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం పీవీ సింధు, మూడో ర్యాంక్ లో కొనసాగుతుండగా, సైనా నెహ్వాల్, 10 వ స్థానంలో ఉంది.