కరీంనగర్, డిసెంబర్ 30: దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మానేరు నదిపై నిర్మించే తీగల వంతెనకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని రూ.148 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. 21.5 మీటర్ల వెడల్పు, 520 మీటర్ల పొడవుతో నాలుగు వరుసలుగా ఈ వంతెన ఉండనుంది.