కీవ్, డిసెంబర్ 30 : బిట్కాయిన్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతూ.. ఒక సంచలనానికి కారణమైంది. ఉక్రెయిన్లో ఎక్స్మో అనే బిట్కాయిన్ ఎక్స్చేంజ్ సంస్థ సీఈవోను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆరోజు ఉద్యోగానికి వెళ్లి విధులు ముగించుకొని వస్తున్న పావెల్ లెర్నర్ (40)ను దుండగులు అపహరించుకుపోయారు. ఎక్స్మో ఎక్స్చేంజ్ కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. కాగా లెర్నర్ కిడ్నాప్ కు గురైన అరగంట పాటు ఎక్స్మో వెబ్సైట్ క్రాష్ కావడం గమనార్హం.