హైదరాబాద్, డిసెంబర్ 29 : భారత్ మహిళా క్రికెట్ జట్టు సారధి మిథాలీరాజ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఈ ఏడాది మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు మిథాలీరాజ్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు పై ఓటమి పాలైనప్పటికీ, అద్భుత ప్రదర్శనతో టీమిండియా జట్టు రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం మిథాలీ రాజ్కు రూ. కోటి నగదుతో పాటు బంజారా హిల్స్లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో క్రీడల మంత్రి పద్మారావు, మిథాలీకి నగదు రూ.కోటి చెక్కు, ఇంటి స్థలం పత్రాల్ని అందజేశారు.