భక్తులతో పోటెత్తిన తిరుమల...

SMTV Desk 2017-12-28 15:53:07  tirumala, tirupati, Vikunta Ekadashi

తిరుమల, డిసెంబర్ 28: మార్గశిరం-పుష్యం ఈ రెండింట్లో ఏదో ఒక మాసంలో శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు మహావిష్ణువు ఉత్తర ద్వారం గుండానే వైకుంఠంలోకి ప్రవేశించాడని, ఆయన నడిచిన ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వశిస్తారు. ఇప్పటికే వైకుంఠం-2లోని అన్ని కంపార్టుమెంట్లు, ఆళ్వార్‌ ట్యాంకు క్యూలైన్లు పూర్తిగా నిండాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు.