ముంబై, డిసెంబర్ 28 : టీమిండియా క్రికెట్ జట్టు ఈ సంవత్సరం ఒక్క సిరీస్ ఓడిపోకుండా, మొత్తం 37 మ్యాచ్ ల్లో గెలిచి 2017 ను ఘనంగా ముగించింది. ప్రస్తుతం కోహ్లీ సేన కఠినమైన సఫారీలతో సిరీస్ కోసం ఈ రోజు ఉదయం దక్షిణాఫ్రికా బయలుదేరింది. ఈ సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ.." మా సత్తా ఏంటో అందరికీ తెలుసు. దక్షిణాఫ్రికా సిరీస్ కు మేమంతా సిద్దంగా ఉన్నాం. మాపై ఎటువంటి ఒత్తిడి లేదు. అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఆడి విజయం సాధించే లక్ష్యంతో మేము బరిలోకి దిగుతున్నాం. దక్షిణాఫ్రికా పర్యటనలో మేమేంటో నిరూపించుకోవాల్సింది ఒక్క అభిమానులకు మాత్రమే. అంతేకాని.. ఎవరి కోసమో తామేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని వ్యాఖ్యానించారు.