చిత్తూరు జిల్లా, జూన్ 18 : ప్రముఖ సీనీనటి హెబ్బాపటేల్ చిత్తూర్ జిల్లా మదనపల్లె కదిరి రోడ్డులోని అత్యాధునికంగా ఏర్పాటు చేసిన స్టెల్లర్ ఫర్నిచర్ షాపు ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిధిగా హాజరై హాల్ చల్ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆమె షాపు ప్రారంభానికి వస్తున్నారన్న సమాచారంతో సినీ అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో జనాన్ని అదుపుచేసేందుకు ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హెబ్బాపటేల్ అక్కడికి చేరగానే ఆమె అభిమానులు గట్టిగా కేరింతలు కొట్టారు. కారు నుండి ఆమెను షాపు లోపలికి తీసుకువచ్చేందుకు బౌన్సర్స్, పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. షాపు ప్రారంభోత్సవం పూర్తయి తర్వాత అతిథులైన స్థానిక నేతలను సీనీ నటి మర్యాదపూర్వకంగా పలుకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లెలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం తనకెంతో నచ్చిందంటూ వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తున్నట్లు తెలిపారు.