గాయని చిత్ర కు "హరివరాసనం" పురస్కారం...

SMTV Desk 2017-12-28 14:51:00  ks chitra, harivarasam award, kerala government.

తిరువనంతపురం, డిసెంబర్ 28 : తన గొంతుతో గీతాలను ఆలపించి శ్రోతల మనసులు గెలుచుకున్న ప్రముఖ గాయని కె.ఎస్. చిత్రను “హరివరాసనం” పురస్కారం వరించింది. ఆమె పాటలతో సమానత్వాన్ని, లౌకిక స్ఫూర్తిని, సౌభాతృత్వ పెంపుకు కృషిచేసినందుకు ఆమెకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. శబరిమల దేవస్థానంలో జనవరి 14న జరిగే ఓ కార్యక్రమంలో చిత్రకు ఈ పురస్కారంతో పాటు, రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికని అందించనున్నారు. ఇప్పటికే తన గాత్ర జీవితములో ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొని ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా చిత్ర రికార్డ్ దక్కించుకున్నారు.