హైదరాబాద్, జూన్ 18 : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ వేసుకునే డ్రెస్ లు చాలా వివాదంగా మారుతున్నా ఇటీవలే ప్రియాంక చోప్రా ప్రధాని మోడీ ని కలిసిన సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ పై అందరు మండిపడ్డారు. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మిని కూడా ఇలాంటి వివాదమే చుట్టూ ముట్టింది. ఈ మధ్య ఛార్మి గురుద్వర్ కు వెళ్ళింది. సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వార్ కు ఛార్మి మోకాళ్ళు కనిపించేలా డ్రెస్ వేసుకొని గురుద్వర్ కు రావడం తో అక్కడి మత పెద్దలు తిడుతున్నారట. ఈ ఫోటోలను ఛార్మి సోషల్ మీడియా లో పోస్టు చేసి పెద్ద దుమారమే రేపింది. ఈ విషయం పై సోషల్ మీడియా లో అందరు చివాట్లు పెడుతున్నారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్ కూడా చార్మి పై మండి పడ్డాడని తెలుస్తుంది.