ఏఎన్‌యూలో ఐఈఏ సదస్సును ప్రారభించిన రాష్ట్రపతి

SMTV Desk 2017-12-27 11:09:21  president, iea ceremony, ramnath kovind, ap cm

అమరావతి, డిసెంబర్ 27 : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దంపతులు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో(ఏఎన్‌యూ) జరిగే ఐఈఏ వందో వార్షిక సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, ప‌లువురు ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. వేడుక అనంతరం రాష్ట్రపతి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేవేశపెట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, మధ్యాహ్నం 2గంటలకు న్యూఢిల్లీకి పయనం కానున్నారు.