చెన్నై, డిసెంబర్ 25 : తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆధికార పార్టీ అన్నాడీఎంకే ఆరుగురు నేతలపై వేటు వేసింది. ఈ రోజు జరిగిన అన్నాడీఎంకే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉన్నత సమావేశంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, పార్టీ ఉన్నత నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా . ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో పరాజయంపై చర్చించిన నేతలు అనంతరం వెట్రివేల్, తంగ తమిళ్ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, కలైరాజన్, షోలింగూర్ పార్థిబన్లను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న కారణంగా తొలగించినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.