హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్ సిటీ లో జరిగిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ వివాహానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతి సమేతంగా హాజరయ్యారు. ఈ వివాహంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదతర మంత్రులు సహా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నూతన దంపతులను ఈ సందర్భంగా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఈ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ మేయర్ రవీంద్రసింగ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, గుత్తా మధు, రసమయ బాలకిషన్ తదితరులు ఉత్సాహంగా నృత్యాలు చేసారు.