హైదరాబాద్, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన... “క్రీస్తు జన్మించిన శుభ సమయాన సమస్త మానవాళికి నా తరుపున, జనసేన శ్రేణుల తరుపున ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. జై హింద్” అంటూ పోస్ట్ చేశారు. ఆయన ఈ ట్విట్ కు ఇప్పటికే 3 వేల మంది లైక్ కొట్టగా, 9 వందల మంది రీట్విట్ చేస్తూ...తిరిగి శుభాకాంక్షలు చెప్పారు.