ముంబయి, డిసెంబర్ 24: అందాల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కు బరేలీ అంతర్జాతీయ వర్శిటీ డాక్టరేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పొగ మంచు కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఆమె, యుపిలోని బరేలీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన డాక్టరేట్ ప్రదాన కార్యక్రమానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరుకలేపోయింది. ఈ కార్యక్రమానికి చేరుకోలేకపోవడంపై ప్రియాంక విచారం వ్యక్తంచేశారు. సుమారు ఐదేళ్ల తర్వాత స్వస్థలానికి ఆదివారం ఆమె బయలుదేరడానికి, ఉదయమే విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ పొగమంచు కారణంగా ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గాలు కోసం ప్రయత్నించినా ఫలితం దొరకలేదని ప్రియాంక పేర్కొన్నారు. అయితే తన గైర్హాజరీని అర్థం చేసుకున్నందుకు వర్శిటి అధికారులకు తన ధన్యవాదాలు తెలిపారు.