పోలవరం నిర్మాణానికి అడ్డుపడకండి : ప్రత్తిపాటి

SMTV Desk 2017-12-24 15:22:23  polavaram project, prathipati pullarao, guntur

గుంటూరు, డిసెంబర్ 24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై వైకాపా అనవసర ప్రచారం చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్‌ పోలవరంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని ప్రచారాలు చేసిన, అడ్డుపడినా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.