పోరుకు సిద్ధం

SMTV Desk 2017-06-18 12:40:50  bhaarath,pakistan,kohli,ajahar ali

లండన్, జూన్ 18 : ఏ జట్లు పోటి పడిన రాని మజా ఒక్క భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు మాత్రమే వస్తుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడేప్పుడని ఎదురు చూస్తున్న అలాంటి మ్యాచ్ కు సమయం రానే వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ లో భారత్ - పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు ప్రత్యర్ధి దేశాల మధ్య జరిగే ఈ సమరాన్ని తిలకించేందుకు అభిమానులు ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు. ఆ సమరం మరి కొద్ది గంటల్లో మొదలు కానుంది. భారత్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు అన్నింటిలో రాణిస్తూ వస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో చాలా బలంగా ఉంది. ఓపెనర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మంచి అరంభాన్నిస్తున్నారు. వన్ డౌన్లో విరాట్ కోహ్లి ఫాంలో ఉన్నాడు. మిడిలాడర్లో యువరాజ్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఫినిషార్ గా హర్ధిక్ పాండ్య, ధోని అద్భుతంగా ముగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో అన్నింటిలో రాణించి ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో రానిస్తే భారత్ విజయం సాధిస్తుంది. భారత్ బౌలింగ్ లో కూడా మంచి ఫాంలో ఉంది. భువనేశ్వర్, బుమ్ర, ఉమేష్ యాదవ్, జడేజా, కేదార్ జాదవ్ వంటి బౌలర్స్ బాగా రాణిస్తున్నారు. పాకిస్తాన్ కూడా అన్ని మ్యాచ్ లో అద్భుతంగా ఆడుతున్నారు. పాక్ బ్యాటింగ్ అజర్, ఫకర్, మాలిక్, హాఫిజ్ వంటి స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. పాక్ బౌలింగ్ లో షాదాబ్, హసన్ అలీ వంటి బౌలర్స్ తో పాకిస్తాన్ కూడా బలం గా ఉంది. ఆరంభంలో భారత్ తో ఓడిన పాక్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి కసి తీర్చుకోవాలని చూస్తుంది.