ఐదు లక్షల పంట కుంటల్ని జాతికి అంకితం చేస్తా౦: చంద్రబాబు

SMTV Desk 2017-12-24 10:37:26  janmabhoomi-maa uru, chandrababu naidu, ap am

అమరావతి, డిసెంబర్ 24: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ రాష్ట్రంలోని ప్రతి గుమ్మానికి చేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న జన్మభూమి- మా ఊరు కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి శనివారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జన్మభూమి-మా ఊరులో ఐదు లక్షల పంట కుంటల్ని జాతికి అంకితం చేస్తామని తెలిపారు. పది రోజులూ పది అంశాలపై గ్రామస్థాయిలో విస్తృత చర్చ జరగాలని, ప్రజల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని సన్మానించాలన్నారు. ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేయాలని చెప్పారు.