ధోనీ, రైనాతో బరిలోకి చెన్నై

SMTV Desk 2017-12-23 11:50:20  ipl-11, raina, dhoni, chennai super kings, ashwin

చెన్నై, డిసెంబర్ 23: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-11 సీజన్ టోర్నీ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ హీరోలు ఎంఎస్‌ ధోనీ, సురేశ్‌ రైనా తిరిగి ఆ జట్టులో ఆడనున్నారు. ఐపీఎల్ నూతనంగా ప్రవేశపెట్టిన రిటెన్షన్ విధానం ప్రకారం ప్రతి జట్టు ముగ్గురి ఆటగాళ్లని అట్టి పెట్టుకుని...మరో ఇద్దరిని రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆటగాడిపై ఆఖరి హక్కు కింద తీసుకోవచ్చని సీఎస్‌కే డైరెక్టర్‌ జార్జి జాన్‌ వెల్లడించారు. అయితే మూడో ఆటగాడిగా అల్ రౌండర్ జడేజా స్పిన్నర్‌, ఆర్‌.అశ్విన్‌లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో ఫ్రాంచైజ్ లు ఉన్నారు. ఆర్‌టీఎం ద్వారా వాషింగ్టన్‌ సుందర్‌, డ్వేన్‌ బ్రేవో, మెకల్లమ్‌, డుప్లెసిస్‌లలో ఇద్దరు జట్టులోకి రావచ్చు. అశ్విన్‌ సంవత్సరం పైగా ఏ ఫార్మాట్ లో ఆడకపోవడం, పరిమిత ఓవర్లలోనూ భారత జట్టులో చోటులేకపోవడం ప్రతికూలాంశంగా మారింది. జడేజా మూడో ఆటగాడయ్యే అవకాశం ఉందని సమాచారం.