కాణిపాకం, డిసెంబర్ 23: దేవుని ఆలయం ఎదుట ముగ్గురు ప్రబుద్ధులు మద్యం తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి నగరానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగడం నిలిపివేసేందుకు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం ఎదుట సత్యప్రమాణం చేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో స్వామివారికి భక్తులు కొబ్బరికాయలు సమర్పించే ప్రదేశం వద్ద వారు మద్యం తాగుతున్నారు. అది గమనించిన ఆలయ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు.