కడప, డిసెంబర్ 22: జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల కథనం ప్రకారం... కాశినాయన మండలం కోడిగుడ్లపాడు గ్రామంలో అశ్విని, పోరుమామిళ్లలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష రాయాల్సి ఉండగా కళాశాలకు వెళ్లకుండ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో లేఖ రాసి ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. పరీక్షల భయంతోనే తమ కుమార్తె మరణించింది అంటూ తల్లి కమలమ్మ, తండ్రి వెంకటయ్య పోలీసులకు వెల్లడించారు.