కోడి పందేలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...

SMTV Desk 2017-12-22 14:41:39  China rajappa, sankranthi, andhrapradesh

రాజమహేంద్రవరం, డిసెంబర్ 22: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, చట్టాన్ని గౌరవిస్తూ సంక్రాంతి పండుగను జరుపుకుందమంటూ ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులలో కోడి పందేలు నిర్వహించవచ్చాన్నారు. ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని చినరాజప్ప శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.